వచ్చే నెలలో ప్రొ కబడ్డీ వేలం

9 Mar, 2019 01:10 IST|Sakshi

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడో సీజన్‌ కోసం వచ్చే నెల 8, 9 తేదీల్లో  ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారు. ‘రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం ప్రక్రియను ముంబైలో నిర్వహిస్తాం. 12 జట్లు తలపడే ఈ సీజన్‌ పోటీలు జూలై 19న మొదలవుతాయి’ అని లీగ్‌ కమిషనర్‌ అనుపమ్‌ గోస్వామి వెల్లడించారు. వచ్చే ఏడాది ఎనిమిదో సీజన్‌ పోటీలను కూడా జూలైలోనే ప్రారంభిస్తామని ఆయన అన్నారు. పూర్తి షెడ్యూలును ఈ నెలలోనే ప్రకటిస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు