లంక లక్ష్యం 304

16 Feb, 2019 01:11 IST|Sakshi

డర్బన్‌: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టుపై దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. 304 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 83 పరుగులు చేసింది. తొలి టెస్టు ఆడుతున్న ఒషాదా ఫెర్నాండో (28 బ్యాటింగ్‌), కుశాల్‌ పెరీరా (12 బ్యాటింగ్‌) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.

చేతిలో 7 వికెట్లు ఉన్న లంక మరో 221 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 126/4తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. డు ప్లెసిస్‌ (90), డి కాక్‌ (55) రాణించారు. ఒక దశలో 251/5తో మెరుగైన స్థితిలో ఉన్న సఫారీలు 8 పరుగులకే చివరి 5 వికెట్లు కోల్పోవడం విశేషం. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ లసిత్‌ ఎంబుల్‌డేనియా (5/66) దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. విశ్వ ఫెర్నాండోకు 4 వికెట్లు దక్కాయి.    

మరిన్ని వార్తలు