‘అర్జున’కు ప్రణయ్‌ నామినేట్‌ 

22 Jun, 2020 00:22 IST|Sakshi

చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ ‘అర్జున’ అవార్డు కోసం హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ని నామినేట్‌ చేశారు. ఈ నెల 2న భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, సమీర్‌ వర్మలను ఆ అవార్డు కోసం సిఫార్సు చేయగా... తనను విస్మరించడంపై ప్రణయ్‌ బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఆ మరుసటి రోజే (3న) గోపీచంద్‌ అతని పేరును క్రీడాశాఖకు ప్రతిపాదించారు. ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డీ హోదాలో గోపీచంద్‌ ఈ సిఫార్సు చేశారని, చీఫ్‌ కోచ్‌ హోదాలో కాదని ‘బాయ్‌’ వర్గాలు తెలిపాయి. కాగా బహిరంగ విమర్శలపై ‘బాయ్‌’ ప్రణయ్‌కి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు