ఐపీఎల్ 7: రాజస్థాన్ రాయల్స్ విజయలక్ష్యం 180

23 May, 2014 22:09 IST|Sakshi

మొహాలీ: ఐపీఎల్ 7లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలివన్ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన రాజస్థాన్.. తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఇన్నింగ్స్ ను సెహ్వాగ్, వాహ్రాలు ధాటిగా ఆరంభించారు. అయితే సెహ్వాగ్ (18; 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. అనంతరం వాహ్రాకు జతకలిసిన మార్ష్ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరివురూ బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. వాహ్రా(25), మార్ష్(40) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు.

 

చివర్లో సాహా (27), మిల్లర్(29), బెయిలీ(26) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపరుచుకోవాలంటే నేటి మ్యాచ్ లో గెలవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు