కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ మార్పు

30 Apr, 2016 18:58 IST|Sakshi
కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ మార్పు

మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో పేలవ ప్రదర్శనతో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉన్న కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ పదవి నుంచి డేవిడ్ మిల్లర్ను తొలగించారు. అతని స్థానంలో మురళీ విజయ్ కు జట్టు పగ్గాలు అప్పజెప్పుతూ కింగ్స్ పంజాబ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  కింగ్స్ పంజాబ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'డేవిడ్ మిల్లర్ కెప్టెన్ గా విఫలమైన కారణంగా ఆ బాధ్యతను మురళీ విజయ్ కు అప్పగిస్తున్నాం. కెప్టెన్సీ భారం వల్ల మిల్లర్ ఆటగాడిగా కూడా సఫలం కావడం లేదు.  ఇక నుంచి మిల్లర్ జట్టులో సభ్యుడిగా  మాత్రమే కొనసాగుతాడు' అని కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.

ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో వెనుకబడింది. గతేడాది కూడా పంజాబ్ చివరి స్థానంతోనే ఐపీఎల్ సీజన్ ను ముగించడం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు