లండన్: చివరి యాషెస్ టెస్ట్ కు వర్షం గండం ఎదురైంది. ఐదవ, చివరి యాషెస్ టెస్ట్లో నాలుగో రోజు వర్షం కారణంగా ఆట ప్రారంభం కాలేదు. క్రితం రోజు ఆట నిలిచే సమాయానికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో రూట్ 60 పరుగులు చేయగా, పీటర్సన్ 50 పరుగులు చేయడం విశేషం.
అంతకు ముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 492 పరుగుల భారీ స్కోరు చేసి ఈ టెస్టుపై పట్టు సాధించింది. అయితే వర్ష ప్రభావం ఈ టెస్టు పడటంతో ఇంగ్లాండ్ డ్రా కోసమే ప్రయత్నించే చాన్స్ వుంది. ఇప్పటికే 5 టెస్ట్ల సిరీస్ను ఇంగ్లాండ్ 3-0 తేడాతో గెలిచింది.