మూడో టెస్టు: ఆగిన వర్షం.. మొదలైన మ్యాచ్

29 Dec, 2014 09:08 IST|Sakshi

మెల్బోర్న్: వర్షం తెరిపినివ్వడంతో భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు నాలుగో రోజు ఆట మళ్లీ మొదలైంది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ రోజర్స్, వాట్సన్ బ్యాటింగ్కు దిగారు. సోమవారం లంచ్ సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆటకు గంటన్నర పాటు అంతరాయం ఏర్పడింది.  

అంతకుముందు 462/8 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ (169), రహానె (147) సెంచరీలు సాధించారు. హారిస్ 4, జాన్సన్ 3, నాథన్ లియోన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు