చెన్నైతో మ్యాచ్‌: టాస్‌ గెలిచిన రాజస్తాన్‌

31 Mar, 2019 19:39 IST|Sakshi

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్ కెప్టెన్‌ అజింక్యా రహానే ముందుగా చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఇప్పటివరకూ చెన్నై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించగా,  రాజస్తాన్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. దాంతో తాజా మ్యాచ్‌లో విజయం సాధించి గాడిలో పడాలని రాజస్తాన్‌ భావిస్తోంది. మరొకవైపు సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో చెన్నై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు.

Liveblog

మరిన్ని వార్తలు