వర్షం అడ్డంకితో రాజస్తాన్‌ ఆటగాళ్లు ఏం చేసారంటే!

2 May, 2018 21:30 IST|Sakshi
రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు

న్యూఢిల్లీ : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో రాజస్తాన్‌ ఆటగాళ్లు ఫన్నీ గేమ్స్‌తో సరదాగా గడిపారు. బాటిల్‌ చాలెంజ్‌ అంటూ ఒకరిపై ఒకరు పోటిపడ్డారు. ఈ వీడియోను ఐపీఎల్‌ అధికారిక ట్విటర్‌లో ‘‘వర్షం మ్యాచ్‌ను అడ్డుకుంది.. అయితే ఈ బాటిల్‌ చాలెంజ్‌ను చూడండి’’ అనే క్యాఫ్షన్‌తో పోస్ట్‌ చేశారు.

ఇక ఈ వీడియోలో డగౌట్‌లో ఉన్న రాజస్థాన్‌ ఆటగాళ్లు ఉనద్కట్‌, అనురిత్‌ సింగ్‌, ప్రశాంత్‌ చోప్రాలు మరికొంత మంది ఓ టేబుల్‌పై బాటిల్‌ను తిప్పుతూ సరదాగా ఒకరికొకరు చాలెంజ్‌ చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు