జైపూర్: ఐపీఎల్ విజేత హోదాలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లోనే ఓటమి పాలైంది రాజస్థాన రాయల్స్ తో శనివారం జైపూర్లో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్లో ముంబైకు చుక్కెదురైంది. బ్యాటింగ్నే ప్రధాన బలంగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. కాగా, రాజస్థాన రాయల్స్ మాత్రం సమిష్టిగా ఆడి గెలుపు బావుటా ఎగురవేశారు. ముంబై ఇండియన్స్ విసిరిన 143 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రాజస్థాన్ ఆటగాళ్లలో రహానే (33) పరుగులతో శుభారంభాన్నిచ్చాడు.
అనంతరం శ్యాంసన్(54), వాట్సన్ (27), బిన్నీ(27) పరుగులు చేయడంతో విజయం చేజిక్కించుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ(44), పొలార్డ్(42) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. సచిన్ టెండూల్కర్ రాణిస్తాడనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. కేవలం సచిన్ (15) పరుగులు మాత్రమే పెవిలియన్కు చేరాడు.