రాజీవ్ శుక్లాకు తప్పిన పదవీగండం

30 Mar, 2017 20:01 IST|Sakshi
రాజీవ్ శుక్లాకు తప్పిన పదవీగండం

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ గా రాజీవ్ శుక్లా కొనసాగనున్నారు. బీసీసీఐ వ్యవహారాలు పర్యవేక్షించడానికి వినోద్ రాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ ఆయనకు పచ్చజెండా ఊపింది. శుక్లాను తొలగించే అవకాశముందని మీడియాలో ఊహాగానాలు వచ్చాయి.

రాజీవ్ శుక్లా పదవికి ముప్పు వాటిల్లకపోవడంతో ఐపీఎల్ చైర్మన్ గా కొత్త వ్యక్తిని నియమించే అవకాశం లేదని తేలిపోయింది. అయితే ఐపీఎల్ పాలక మండలి కార్యకలాపాలను అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ పర్యవేక్షించనుంది.

>
మరిన్ని వార్తలు