రన్నరప్‌ రాజేశ్వర్‌ రెడ్డి

29 Jun, 2019 14:05 IST|Sakshi

‘ఐటా’ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌:అఖిల భారత టెన్నిస్‌  సంఘం (ఐటా) ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు పట్లోళ్ల రాజేశ్వర్‌ రెడ్డి ఆకట్టుకున్నాడు. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఈ టోర్నీలో రాజేశ్వర్‌ రెడ్డి రన్నరప్‌ ట్రోఫీని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన అండర్‌–16 బాలుర సింగిల్స్‌ ఫైనల్లో రాజేశ్వర్‌ రెడ్డి (తెలంగాణ) 5–7, 2–6తో ఆర్యన్‌ ఠాకూర్‌ (చండీగఢ్‌) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయాడు.   

మరిన్ని వార్తలు