తొలిరోజు భారత్‌కు నిరాశ

9 Sep, 2014 01:05 IST|Sakshi

రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్

తాష్కెంట్: ప్రపంచ చాంపియన్‌షిప్ అర్హత రౌండ్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు నిరాశపరిచారు. సోమవారం ప్రారంభమైన ఈ పోటీల్లో... కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన  రాజీవ్ తోమర్ 125కేజీల ఫ్రీస్టయిల్‌లో 1-3 తేడాతో కొరియాకు చెందిన ర్యోంగ్ సంగ్ చేతిలో ఓడాడు. అలాగే 70కేజీల ఫ్రీస్టయిల్‌లోనూ అరుణ్ 0-4 తేడాతో క్లియోపస్ క్యూబ్ (కెనడా) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో మరో ఇద్దరు భారత రెజ్లర్లు రాహుల్ బాలాసాహెబ్ అవారే, నరేశ్ కుమార్ తమ ప్రత్యర్థుల చేతిలో మట్టికరిచారు. ఆసియా గేమ్స్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్ తరఫున ద్వితీయ శ్రేణి రెజ్లర్లు బరిలోకి దిగారు.

మరిన్ని వార్తలు