'భారత్ కు ఆడతానని అనుకోలేదు'

17 Nov, 2015 19:53 IST|Sakshi
'భారత్ కు ఆడతానని అనుకోలేదు'

న్యూఢిల్లీ: తాను భారత జాతీయ జట్టుకు ఆడతానని కలలో కూడా అనుకోలేదని మహిళా షూటర్ శ్రియాంక సదంగి స్పష్టం చేసింది. ఇటీవల కువైట్ నగరంలో జరిగిన 13 వ ఆసియన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో జూనియర్ మహిళల టీమ్ ఈవెంట్ లో రజత పతకం సాధించిన శ్రియాంక..  జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం నిజంగా గర్వంగా ఉందని పేర్కొంది.

 

తనకు ఊహ తెలిసినప్పట్నుంచీ  షూటింగ్ లో రాణించాలనే తపన ఎక్కువగా ఉండేదని తెలిపింది. అయితే తాను షూటింగ్ ను క్రీడగా ఎంచుకోవటానికి భారత స్టార్ షూటర్ రాజ్యవర్థన్ సింగ్ రాధోడ్ ప్రధాన కారణమని పేర్కొంది. 2004 లో ఏథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో రాధోడ్ రజతం గెలవడమే తనలో స్ఫూర్తిని నింపిందని శ్రియాంక తెలిపింది.

మరిన్ని వార్తలు