భారత ‘ఎ’ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా రమేశ్‌ పొవార్‌ 

28 Aug, 2019 07:09 IST|Sakshi

ముంబై: దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా రమేశ్‌ పొవార్‌ను నియమించారు. తిరువనంతపురంలో గురువారం మొదలయ్యే ఈ సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు, ఐదు అనధికారిక వన్డేలు జరుగుతాయి. టీమిండియా తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్‌ పొవార్‌ భారత మహిళల జట్టుకు హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు. అదే సమయంలో సీనియర్‌ సభ్యురాలు మిథాలీ రాజ్, పొవార్‌ మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాదం తర్వాత మరోసారి అతను మహిళల జట్టు హెడ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కపిల్‌ దేవ్‌ నాయకత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ రమేశ్‌ పొవార్‌ను కాదని డబ్ల్యూవీ రామన్‌ను మహిళల జట్టుకు కోచ్‌గా నియమించింది.   


 

మరిన్ని వార్తలు