రవిశాస్త్రి ఫొటో వైరల్‌.. ట్రోలింగ్‌

5 Jun, 2019 14:38 IST|Sakshi

ఇద్దరు మహిళాభిమానులతో టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి దిగిన ఫొటో వైరల్‌ కావడంతో ట్విటర్‌లో ట్రోలింగ్‌ మొదలైంది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనున్న నేపథ్యంలో ఈ ఫొటో వైరల్‌ కావడంతో రవిశాస్త్రిపై విమర్శలు వస్తున్నాయి. ట్విటర్‌లో ప్రముఖుడిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌ డెన్నిస్‌ ఫ్రీడ్‌మాన్‌ ఈ ఫొటోపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘ఇండియా వరల్డ్‌కప్‌ సన్నాహాలు చాలా బాగా సాగుతున్నట్టున్నాయి’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఫొటోలో మరో వ్యక్తి ఉన్నాడు. టీమిండియాతో అతడికి ఎటువంటి సంబంధం లేదు.

రవిశాస్త్రి ఫొటోపై ట్విటర్‌లో కామెంట్లు పోటెత్తాయి. ‘ఇంతకుముందు టీమిండియా నిర్వహించిన అధికారిక ప్రెస్‌మీట్‌కు ఇందుకే రాలేదనుకుంటా’ అని ఒకరు వ్యాఖ్యానించారు. షేన్‌వార్న్‌ కంటే రవిశాస్త్రి మంచి ప్లేబాయ్‌ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. ‘ఫీల్డింగ్‌ ఎట్‌ ఫైన్‌ లెగ్‌’  అంటూ ఇంకొరు క్యాప్షన్‌ తగిలించారు. రవిశాస్త్రి ఎవరో తెలియకపోతే అజహర్‌ సినిమాను మరో​సారి చూడాలని యువతులకు పాకిస్తాన్‌ అభిమాని ఒకరు సూచించారు. 

>
మరిన్ని వార్తలు