క్వార్టర్స్‌లో బోపన్న జంట 

3 Oct, 2018 01:01 IST|Sakshi

బీజింగ్‌: చైనా ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–రోజర్‌ వాసెలిన్‌ (నెదర్లాండ్స్‌) ద్వయం శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–వాసెలిన్‌ జంట 6–2, 7–6 (7/5)తో కైల్‌ ఎడ్మండ్‌ (బ్రిటన్‌)–మార్టన్‌ ఫక్సోవిక్స్‌ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ లుకాస్‌ కుబోట్‌ (పోలాండ్‌)–మార్సెలో మెలో (బ్రెజిల్‌) ద్వయంతో బోపన్న జంట తలపడుతుంది.    

మరిన్ని వార్తలు