పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో విజయం సాధించి మంచి ఊపుమీద ఉన్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్టు ఆరంభానికి ముందే ఇద్దరు టీమిండియా కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. శుక్రవారం పెర్త్ వేదికగా ఆరంభంకానున్న రెండో టెస్టు మ్యాచ్కు అశ్విన్, రోహిత్ శర్మలు దూరమయ్యారు. మరోవైపు గాయంతో తొలి టెస్టుకు దూరమైన ఓపెనర్ పృథ్వీషా ఇంకా కోలుకోలేదు. దీంతో వీరి స్థానాల్లో హునుమ విహారీ, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేశారు.
ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవాలన్న కసితో ఉన్న టీమిండియాకు అశ్విన్ లేకపోవడం ఎదురుదెబ్బే అని చెప్పాలి. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు పెర్త్ పిచ్ టీమిండియా కంటే ఆసీస్ ఆటగాళ్లకే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. దాంతో ఇద్దరు ఆటగాళ్లు దూరం కావడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది.