శ్రీలంకకు పయనమైన భారత జట్టు

5 Mar, 2018 04:30 IST|Sakshi
ముంబై విమానాశ్రయం లాంజ్‌లో భారత ఆటగాళ్లు

ముంబై: ముక్కోణపు టి20 టోర్నీలో పాల్గొనేందుకు రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్‌ జట్టు ఆదివారం శ్రీలంక బయల్దేరి వెళ్లింది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌... శ్రీలంకతో తలపడనుంది. మూడు జట్లు ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫైనల్‌ సహా ఈ మ్యాచ్‌లన్నిటికీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియమే వేదిక కానుంది.  

మరిన్ని వార్తలు