రోహిత్‌ శర్మకు అరుదైన గౌరవం

3 Jun, 2018 01:22 IST|Sakshi

అమెరికాలో సుప్రసిద్ధ ‘మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌’లో భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ పరకాయ ప్రవేశం చేయనున్నాడు. ఆ లీగ్‌లో ఆడే సియాటెల్‌ మారినర్స్‌ జట్టు తరఫున అతను ‘ఫస్ట్‌ పిచ్‌’ చాన్స్‌ కొట్టేశాడు. ఈ మేరకు భారత స్టార్‌ క్రికెటర్‌ను సియాటెల్‌ జట్టు ఆహ్వానించింది.

సాఫెకొ ఫీల్డ్‌లోని మారినర్స్‌  హోమ్‌ గ్రౌండ్‌లో ప్రారంభోత్సవ మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ ‘ఫస్ట్‌ పిచ్‌’తో బేస్‌బాల్‌ మ్యాచ్‌ మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంటకు ఈ మ్యాచ్‌ మొదలవుతుంది. మ్యాచ్‌ ముందు బేస్‌బాల్‌ను విసరడమే ‘ఫస్ట్‌ పిచ్‌’ అంటారు.  

మరిన్ని వార్తలు