న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్, జడేజా దులీప్ ట్రోఫీ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు. కోచ్ కుంబ్లేను సంప్రదించిన తర్వాత భారత సెలక్టర్లు ఈ ప్రకటన చేశారు. 10 నుంచి జరిగే ఫైనల్లో రెడ్ జట్టులో ధావన్, బ్లూ జట్టులో రోహిత్ శర్మ, జడేజా ఆడతారు.