రన్నరప్ హైదరాబాద్

14 Feb, 2014 00:21 IST|Sakshi

జింఖానా,న్యూస్‌లైన్: సీనియర్ మహిళల ఎలైట్ సూపర్ లీగ్ ట్వంటీ 20 టోర్నీలో హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది.
 
 వాణి 36 పరుగులు చేసింది.హైదరాబాద్ బౌలర్లలో డయానా డేవిడ్ రెండు వికెట్లు పడగొట్టగా... మమత, కావ్య తలా ఓ వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన  హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. షాలిని (22 నాటౌట్), మమత (20 నాటౌట్), సింధుజ (18), స్నేహ (17) ఫర్వాలేదనిపించారు. ఈ విజయంతో మొత్తం 8 పాయింట్లతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలువగా... మరోవైపు 12  పాయింట్లు సాధించిన రైల్వేస్ జట్టు విజేతగా నిలిచింది.
 

మరిన్ని వార్తలు