రన్నరప్ భారత్

17 Aug, 2015 01:41 IST|Sakshi

వ్రోక్లా (పోలండ్) : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నమెంట్ రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో దీపిక కుమారి-మంగళ్ సింగ్ చాంపియా (భారత్) ద్వయం రజత పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక-మంగళ్ సింగ్ జంట 1-5తో ఐదా రోమన్-యువాన్ సెరానో (మెక్సికో) జోడీ చేతిలో ఓడిపోయింది. తొలి సెట్‌లో రెండు జట్ల స్కోరు 36-36తో సమం కావడంతో ఒక్కో పాయింట్ దక్కింది. ఆ తర్వాత భారత జోడీ రెండో సెట్‌ను 35-37తో, మూడో సెట్‌ను 36-37తో కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకుంది.

మరిన్ని వార్తలు