రన్నరప్ సానియా జంట

25 Apr, 2016 00:54 IST|Sakshi

స్టట్‌గార్ట్ (జర్మనీ): ఈ సీజన్‌లో ఐదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన పోర్షె టెన్నిస్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 81 నిమిషాలపాటు జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-2, 1-6, 6-10తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. 

రన్నరప్‌గా నిలిచిన సానియా జంటకు 17,459 యూరోల (రూ. 13 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 305 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సానియా-హింగిస్ జంట బ్రిస్బేన్ , సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, సెయింట్ పీటర్స్‌బర్గ్ ఓపెన్ టోర్నమెంట్‌లలో టైటిల్ సాధించింది.

>
మరిన్ని వార్తలు