రన్నరప్‌ జయరామ్‌ 

10 Jul, 2018 01:03 IST|Sakshi

వైట్‌నైట్స్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ 

గాట్చిన (రష్యా): భారత మేటి షట్లర్‌ అజయ్‌ జయరామ్‌ వైట్‌నైట్స్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. టైటిల్‌ పోరులో అతను స్పెయిన్‌కు చెందిన టాప్‌ సీడ్‌ పాబ్లో అబియన్‌ చేతిలో పోరాడి ఓడాడు. 30 ఏళ్ల జయరామ్‌ గాయం నుంచి కోలుకున్నాక గత నెలలో బరిలోకి దిగిన యూఎస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ ఈవెంట్‌లో సెమీస్‌ చేరుకున్నాడు.

తాజాగా రష్యాలో జరిగిన ఈవెంట్‌ ఫైనల్లో 21–11, 16–21, 17–21తో పాబ్లో చేతిలో పరాజయం చవిచూశాడు. 55 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత ఆటగాడు తర్వాతి రెండు గేముల్లో ప్రత్యర్థితో పోరాడినప్పటికీ ఫలితం సాధించలేకపోయాడు. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో తరుణ్‌ కోనా–సౌరభ్‌ శర్మ జంట 21–18, 13–21, 17–21తో జార్నే జెయిస్‌–జాన్‌ కొలిన్‌ ఓల్కర్‌ (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది.   

మరిన్ని వార్తలు