రుత్విక, బాలు మహేంద్రలకు టైటిల్స్

25 Sep, 2013 23:38 IST|Sakshi

జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్-19 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ టైటిల్‌ను గద్దె రుత్విక శివాని (ఖమ్మం), బాలుర టైటిల్‌ను బాలు మహేంద్ర గెలుచుకున్నారు. తణుకులో బుధవారం ఈ పోటీలు ముగిశాయి.  బాలికల ఫైనల్లో స్కోరు 15-13 ఉన్న దశలో రుత్విక ప్రత్యర్థి, టాప్‌సీడ్ రితుపర్ణదాస్ మ్యాచ్ నుంచి తప్పుకుంది. దీంతో రెండోసీడ్ రుత్వికను విజేతగా ప్రకటించారు. సెమీఫైనల్స్‌లో రుత్విక 21-13, 21-15తో శ్రీ కృష్ణప్రియ (హైదరాబాద్)పై; రితుపర్ణదాస్ 20-22, 21-19, 21-11తో వృశాలి (రంగారెడ్డి)పై విజయం సాధించారు.
 
 బాలుర ఫైనల్లో రెండోసీడ్ బాలు మహేంద్ర (విశాఖపట్నం) 21-9, 20-11, 21-10తో అనీత్ కుమార్ (రంగారెడ్డి)పై నెగ్గాడు. సెమీఫైనల్స్‌లో బాలు మహేంద్ర 21-9, 21-18తో కిరణ్ కుమార్ (రంగారెడ్డి)పై; అనీత్ కుమార్ 21-18, 8-21, 21-5తో చంద్రకుమార్ (తూర్పు గోదావరి)పై విజయం సాధించారు.
 
 బాలికల డబుల్స్‌లో మేఘన-రితుపర్ణదాస్ జోడి 21-15, 21-19తో పూజ-సోనికా సాయిలపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలుర కేటగిరీలో చైతన్య-గంగాధర్ రావు జంట 21-13, 21-16తో ఉపేందర్-అనిత్ కుమార్ జోడిని ఓడించింది. విజేతలకు భారత బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలను అందజేశారు.
 

మరిన్ని వార్తలు