రుత్విక, వృశాలి సంచలనం

19 Jul, 2014 00:14 IST|Sakshi
రుత్విక, వృశాలి సంచలనం

క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్ వర్మ
  ఆలిండియా జూ॥బ్యాడ్మింటన్ టోర్నీ
 
 సాక్షి, హైదరాబాద్: గౌతమ్ ఠక్కర్ స్మారక అఖిల భారత జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారిణులు జి.రుత్విక శివాని, జి.వృశాలి సంచలన విజయాలు సాధించారు. శుక్రవారం జరిగిన అండర్-19 బాలికల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అన్‌సీడెడ్ రుత్విక 21-6, 21-16 తేడాతో మూడో సీడ్ శ్రీయాన్షి పర్దేశి (ఎయిరిండియా)పై... అన్‌సీడెడ్ వృశాలి 21-13, 17-21, 21-12తో ఆరో సీడ్ కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర)పై గెలిచారు.
 
  అయితే ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో క్రీడాకారిణి సంతోషి హాసిని 18-21, 15-21 తేడాతో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా) చేతిలో ఓటమి పాలైంది. ఇక బాలికల అండర్-17 ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజితరావు 21-18, 20-22, 21-14 తేడాతో అశ్మితా చలీహ (అసోం)పై, జి.వృశాలి 21-16, 21-18 తేడాతో రియా ముఖర్జీ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందగా, కె.వైష్ణవి 21-15, 21-18 తేడాతో అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది.అయితే బి.అర్చన 6-21, 6-21 తేడాతో శిఖా గౌతమ్ (కర్ణాటక) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. బాలుర అండర్-17లో ఏపీ క్రీడాకారులు ఎం.కనిష్క్, రాహుల్ యాదవ్, సిరిల్ వర్మలు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ కనిష్క్ 21-17, 21-12 తేడాతో కార్తీక్ జిందాల్ (హర్యానా)పై గెలుపొందగా, మూడో సీడ్ రాహుల్ యాదవ్ 21-11, 19-21, 21-18తో సిద్ధార్థ్ ప్రతాప్‌సింగ్ (చత్తీస్‌గఢ్)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇక సిరిల్ వర్మ 21-12, 21-14తో నిశ్చయ్ జైస్వాల్ (మధ్యప్రదేశ్)పై గెలవగా, కె.జగదీశ్ 10-21, 17-21 తేడాతో రాహుల్ భరద్వాజ్ (కర్ణాటక) చేతిలో ఓటమిపాలయ్యాడు.
 

మరిన్ని వార్తలు