సాక్షి, ముంబై : యువ క్రికెటర్, అండర్-19 హీరో పృథ్వీషా రోజు రోజుకి తన ఆటలో పరిణితి చెందుతున్నాడని, గత అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ముంబై టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభించాకా ప్రసంగిస్తూ.. యువ క్రికెటర్లకు ఇదోక సువర్ణావకాశమని, ఈ లీగ్తో ముంబై క్రికెట్కు ఎంతో లాభం కలుగుతుందని సచిన్ తెలిపారు. రహానే సారథ్యం వహిస్తున్న నార్త్ ముంబై పాంథర్స్ జట్టులో పృథ్వీషా మరింత రాటుదేలాలన్నారు. ఈ టీ20 లీగ్కు కమిషనర్గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లు కష్టపడి ఆడుతూ, నాణ్యమైన ఆటగాళ్లుగా పేరు సంపాదించాలని సూచించారు.
ఈ లీగ్లో ఆరు జట్లు పాల్గొంటుండగా.. శ్రీలంక పర్యటన నేపథ్యంలో చాలా మంది యువ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. మాస్టర బ్లాస్టర్ సచిన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీకి మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ లీగ్ కమిషనర్ గా, దిలీప్ వెంగ్సర్కార్, సందీప్పాటిల్, వినోద్ కాంబ్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్లన్నీ ముంబై వాంఖెడే స్టేడియంలో జరుగనున్నాయి.