తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి రోజూ క్రీడా తరగతిని తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీసుకున్న నిర్ణయాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు.
ఇదే విధానాన్ని మిగతా అన్ని తరగతుల వారికి వర్తింపజేయాలని కోరాడు. తద్వారా విద్యార్థుల్లో చురుకుదనం పెంపొందేందుకు వీలుంటుందని పేర్కొన్నాడు.