క్వారంటైన్లుగా ‘సాయ్‌’ సెంటర్లు: కేంద్ర క్రీడా శాఖ

23 Mar, 2020 10:21 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 ఎఫెక్ట్‌కు ఇదివరకే భారత్‌లో క్రీడాకార్యకలాపాలన్నీ మూతపడ్డాయి. ఒక్క శిబిరం లేదు. పోటీల్లేవు. దీంతో భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రాలకు తాళాలు వేశారు. ఇప్పుడీ కేంద్రాలను కరోనా అనుమానిత, బాధిత కేసులకు క్వారంటైన్లుగా (నిర్బంధ వసతులు) వినియోగించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ‘సాయ్‌’ రీజినల్‌ సెంటర్లు, స్టేడియాలు, హాస్టళ్లను క్వారంటైన్లుగా మార్చేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర క్రీడా శాఖ తెలిపింది.   

మరిన్ని వార్తలు