సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ

28 Mar, 2019 15:30 IST|Sakshi

ఐటా టెన్నిస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక రామ్‌ నిలకడగా రాణిస్తున్నారు. బెంగళూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో జంటగా బరిలోకి దిగిన వీరిద్దరూ డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌ చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్‌ ఫైనల్లో సాయిదేదీప్య–మౌలిక రామ్‌ ద్వయం 6–2, 7–6 (9/7)తో రాధిక యాదవ్‌ (హరియాణా)–స్నిగ్ధ (కర్ణాటక) జోడీపై విజయం సాధించి ముందంజ వేసింది.   

మరిన్ని వార్తలు