సాయికార్తీక్‌ రెడ్డికి సింగిల్స్‌ టైటిల్‌

19 May, 2019 09:55 IST|Sakshi

‘ఐటా’ టెన్నిస్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల్‌ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్‌ రెడ్డి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సాయికార్తీక్‌ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ టైటిల్‌పోరులో అన్‌సీడెడ్‌ సాయికార్తీక్‌ 6–3, 6–3తో టాప్‌ సీడ్‌ అన్షు కుమార్‌ భూయాన్‌ (ఒడిశా)ను కంగుతినిపించాడు. ఈ టోర్నమెంట్‌ ఆసాంతం నిలకడగా ఆడిన సాయికార్తీక్‌... జనవరిలో జరిగిన ఖేలో ఇండియా చాంపియన్‌షిప్‌లో అండర్‌–21 పురుషుల సింగిల్స్, డబుల్స్‌ కేటగిరీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాడు.
 

మరిన్ని వార్తలు