కాంస్యంతోనే సరి..

28 Apr, 2018 17:49 IST|Sakshi

వుహాన్‌(చైనా):  ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లు కాంస్య పతకంతోనే సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో వీరిద్దరూ పరాజయం చెందడంతో కాంస్యంతోనే వెనుదిరిగాల్సి వచ్చింది.  టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో సైనా 25-27, 19-21 తేడాతో టాప్‌సీడ్‌ తైజు యింగ్‌(చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో సైనా కడవరకూ పోరాడినా సెమీ ఫైనల్‌ అడ్డంకిని అధిగమించలేకపోయింది.
 

ఇక పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రణయ్‌ 16-21, 18-21తేడాతో ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌(చైనా) చేతిలో పరాజయం చెందాడు.  52నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో చెన్‌ లాంగ్ పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు.

>
మరిన్ని వార్తలు