సెమీస్లో సైనా, శ్రీకాంత్

10 Jun, 2016 15:02 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈ ఇరువురూ తమ తమ సింగిల్స్ విభాగాల్లో విజయం సాధించి సెమీస్కు చేరారు. మహిళల సింగిల్స్ పోరులో సైనా 28-26, 21-16 తేడాతో రాచ్నొక్ పై విజయం సాధించి సెమీస్ చేరగా, పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్ 21-18, 21-17 తేడాతో కొరియాకు చెందిన వాంగ్ హీ హోపై గెలిచి సెమీ ఫైనల్లోకి చేరాడు.

మహిళల సింగిల్స్ భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో  భాగంగా సైనా- రాచ్నాక్ల మధ్య  జరిగిన మొదటి గేమ్ హోరాహోరీగా సాగింది. అయితే కీలక సమయాల్లో రాచ్నాక్ పై పైచేయి సాధించిన సైనా  తొలి గేమ్ను గెలుచుకుంది. ఇక రెండో గేమ్లో ఆది నుంచి ఆధిపత్యం కనబరిచిన సైనా ఆ గేమ్ను కూడా సొంతం చేసుకుని సెమీస్ కు చేరింది. 56 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో  సైనా ఎటువంటి అలసత్వానికి ఆస్కారం ఇవ్వకుండా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. 36 నిమిషాల పాటు జరిగిన పోరులో శ్రీకాంత్ అంచనాలకు మించి రాణించి సెమీస్కు చేరాడు.
 

మరిన్ని వార్తలు