వైదొలిగిన సైనా

4 Sep, 2019 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ నేటి నుంచి మొదలయ్యే చైనీస్‌ తైపీ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి వెదొలిగింది. పురుషుల సింగిల్స్‌ నుంచి సౌరభ్‌ వర్మ, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లు కూడా తప్పుకున్నారు.

మరోవైపు మహిళల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’కు రియా ముఖర్జీ (భారత్‌) అర్హత సాధించింది. క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ఆమె 9–21, 21–16, 23–21తో సుపనిద కటెథొంగ్‌ (థాయ్‌లాండ్‌)పై అద్భుత విజయం సాధించి మెయిన్‌ ‘డ్రా’ లో ప్రవేశించింది.  

మరిన్ని వార్తలు