షా ఆలం (మలేసియా): స్టార్ షట్లర్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్లో జోరు కనబరుస్తున్నారు. మహిళల సింగిల్స్లో వీరిద్దరు క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టారు. గురువారం జరిగిన రెండో రౌండ్లో మూడో సీడ్ సైనా 21-10, 21-16 తేడాతో బే యియోన్ జు (కొరియా)పై సునాయాసంగా నెగ్గింది.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సైనా 11-3తో ఆధిక్యంలో నిలవగా ఆ తర్వాత ప్రత్యర్థి ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. వీరిద్దరి మధ్య 13 సార్లు పోటీ జరగ్గా సైనాకిది తొమ్మిదో విజయం. ఇక మరో సింగిల్స్లో సింధు 22-20, 21-17తో సుంగ్ జి హ్యుయాన్ (కొరియా)పై నెగ్గింది.