సెమీస్‌లో సాకేత్‌

9 Mar, 2018 10:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఇండియన్‌ ఫ్యూచర్స్‌–2 పురుషుల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని నిలకడగా రాణిస్తున్నాడు.

కోల్‌కతాలో జరుగుతోన్న ఈ టోర్నీలో సాకేత్‌ సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఏడో సీడ్‌ సాకేత్‌ 6–3, 6–3తో రెండోసీడ్‌ శశికుమార్‌ ముకుంద్‌కు షాకిచ్చాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ఐదో సీడ్‌ అర్జున్‌తో సాకేత్‌ తలపడతాడు.  

మరిన్ని వార్తలు