పుణే ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే సాకేత్‌ పరాజయం 

21 Nov, 2018 01:46 IST|Sakshi

గతవారం బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని అదే జోరును పుణే ఓపెన్‌లో కొనసాగించలేకపోయాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌ 4–6, 6–7 (1/7)తో భారత్‌కే చెందిన శశికుమార్‌ ముకుంద్‌ చేతిలో ఓడిపోయాడు. గంటా 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌ తొలి సెట్‌లో తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సాకేత్‌ రెండో సెట్‌లో తీవ్రంగా పోరాడాడు. అయితే టైబ్రేక్‌లో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు.  

మరిన్ని వార్తలు