6న సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్స్‌ 

4 Feb, 2020 01:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘సాక్షి ప్రీమియర్‌ లీగ్‌’ (ఎస్‌పీఎల్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. లీగ్‌ మ్యాచ్‌లను విజయవంతంగా ముగించుకున్న ఎస్‌పీఎల్‌ ఫైనల్‌ సమరానికి సిద్ధమైంది. గురువారం జరుగనున్న ఈ టైటిల్‌ పోరు బహుమతి ప్రదాన కార్యక్రమం సైనిక్‌పురిలోని భవన్స్‌ క్రికెట్‌ అకాడమీలో అట్టహాసంగా జరుగనుంది. ఈ వేడుకకు నగరంలోని అన్ని కాలేజీల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఆసక్తి గల వారు తమ కాలేజి ఐడీ కార్డులతో రావాల్సిందిగా నిర్వాహకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు