రాష్ట్ర త్రోబాల్‌ జట్టులో సమీనా, మాథ్యూ

22 Mar, 2019 10:15 IST|Sakshi

జూనియర్‌ జట్ల ప్రకటన  

హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. ఈ జట్టులో ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ జమ్మిగడ్డకు చెందిన షేక్‌ సమీనా యాస్మిన్‌ చోటు దక్కించుకుంది. హరియాణాలోని పానిపట్‌లో ఈనెల 23 నుంచి 25 వరకు జాతీయ జూనియర్‌ త్రోబాల్‌ చాంపియన్‌ షిప్‌ జరుగుతుంది. ఈ జట్లకు కోచ్‌గా అభిషేక్‌ సింగ్, మేనేజర్‌గా సరిత వ్యవహరించనున్నారు. రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు తెలంగాణ త్రోబాల్‌ సంఘం కార్యదర్శి సోమేశ్వర్, డీవైఎస్‌ఓ సుధాకర్‌ రావు స్పోర్ట్స్‌కిట్లను అందజేశారు.  

జట్ల వివరాలు
బాలికలు: వి. నిహారిక, కె. శ్రీవర్ష, ఎన్‌. అపూర్వ, సమీనా యాస్మిన్, సొనాలి పాత్రో, కార్తీక తోట, కె. వసుధ, మేఘన, వినీత, డి. అఖిల, కారుణ్య, లక్ష్మీ జాన్వి, బి. పూజిత, ఎన్‌. ఆశ్రిత.
బాలురు: మార్వెల్‌ పి. మాథ్యూ, నీరజ్‌ కుమార్, నవీన్‌ రాజ్, డి.శ్రీకాంత్, ఎం. తేజ సాయికృష్ణ, బి. అరుణ్‌ కుమార్, హెచ్‌. రంగ, సీహెచ్‌. మనోజ్, ఎం. శివసాయి, సాయికౌశిక్, రామకృష్ణ, జి. శ్రీనివాస్, బాలాజీ,  జీవన్, పరమేశ్‌. 

మరిన్ని వార్తలు