కాంస్యంతో సరిపెట్టుకున్న సనతోయి దేవి

23 Sep, 2014 16:50 IST|Sakshi

ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో వుషు క్రీడాంశంలో సనోతోయిదేవి కాంస్యంతో  సరిపెట్టకుంది.  మంగళవారం జరిగిన సెమీఫైనల్లో ఈ మణిపూర్ క్రీడాకారిణి జాంగ్ లుయాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది.  సోమవారం మహిళల సాండా 52 కేజీల క్వార్టర్ ఫైనల్లో సనతోయి దేవి అద్భుత ప్రదర్శన చేసి సెమీ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. మంగోలియాకు చెందిన అమ్‌గలన్ జర్గల్‌ను 2-0తో విన్ బై రౌండ్ పద్దతిన నెగ్గి సెమీస్‌కు చేరినా.. ఇక్కడ సనతోయిదేవికి నిరాశే ఎదురైంది.

 

కాగా, ఏషియన్ గేమ్స్లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.  100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్లో అభినవ్  బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్పుట్ జట్టు పతకాన్ని సాధించింది. ఇదిలా ఉండగా స్వ్కాష్ లో ఘోషల్ రజతంతో సరిపెట్టుకున్నాడు.

మరిన్ని వార్తలు