మియామి ఓపెన్ క్వార్టర్స్‌లో సానియా జంట

31 Mar, 2015 00:57 IST|Sakshi
మియామి ఓపెన్ క్వార్టర్స్‌లో సానియా జంట

ఫ్లోరిడా (అమెరికా): మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా-హింగిస్ జంట 7-6 (8/6), 6-4తో గాబ్రియేలా దబ్రోవ్‌స్కీ (కెనడా)-అలీసియా రొసోల్‌స్కా (పోలండ్) ద్వయంపై విజయం సాధించింది.

మరిన్ని వార్తలు