సెమీస్‌లో సానియా-హింగిస్ జంట

22 Aug, 2015 00:06 IST|Sakshi

సిన్సినాటి (అమెరికా): వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా ద్వయం 6-4, 6-1తో క్రిస్టినా మెక్‌హలె-కోకో వాండెవెగె (అమెరికా) జంటను ఓడించింది.  మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) -ఫ్లోరిన్ మెర్జియా జంట 1-6, 6-1, 12-14తో ‘సూపర్ టైబ్రేక్’లో డోడిగ్ (క్రొయేషియా)-మెలో (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు