రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–ష్వెదోవా (కజకిస్తాన్) జంట పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా–ష్వెదోవా ద్వయం 3–6, 6–7 (7/9)తో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)–చాన్ యుంగ్జాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది.