మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడి ఓటమి

5 Sep, 2015 09:21 IST|Sakshi
మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడి ఓటమి

న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ లో భారత స్టార్ ప్లేయర్ సానియా మిర్జా-సోర్స్ జోడీ తొలిరౌండ్లోనే ఓటమి పాలైంది. అన్సీడెడ్ ఆండ్రియా-లూకాజ్ జోడి చేతిలో 6-3, 6-3 తేడాతో సానియా-సోర్స్ లు ఓటమి చవిచూశారు. ఇదిలాఉండగా.. ఢిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ నాలుగో రౌండ్కు చేరుకుంది. మూడో రౌండ్లో మాటెక్ సాండ్స్ పై 3-6, 7-5, 6-0 తేడాతో సెరెనా విజయం సాధించింది. మహిళల డబుల్స్లో సానియా(భారత్)-మార్టినా(స్విట్జర్లాండ్) ద్వయం రెండో రౌండ్ చేరుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు