సన్నీత్‌కు టైటిల్‌

19 Apr, 2019 15:30 IST|Sakshi

మాస్టర్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్‌ సిరీస్‌ టోర్నీలో సరోజని అకాడమీకి చెందిన సన్నీత్‌ ఉప్పాటి విజేతగా నిలిచాడు. నేరేడ్‌మెట్‌లోని సెయింట్‌ థామస్‌ హైస్కూల్‌లో జరిగిన అండర్‌–14 బాలుర సింగి ల్స్‌ ఫైనల్లో సన్నీత్‌ 8–3తో శాంత్‌ శరణ్‌పై గెలుపొందాడు. సెమీస్‌లో 8–5తో రిషి వర్మపై, క్వార్టర్స్‌లో 8–4తో యశ్వంత్‌పై విజయం సాధించాడు.    

మరిన్ని వార్తలు