సారా ఖురేషీకి పసిడి పతకం

23 Dec, 2016 11:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జాతీయ చెస్-బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి సారా అఫ్సర్ ఖురేషీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తమిళనాడులో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో సారా ఖురేషీ 83 కేజీల ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచింది. చెస్ గేమ్‌లు ఆడటంతోపాటు బాక్సింగ్ బౌట్‌లలో తలపడటమే చెస్-బాక్సింగ్ క్రీడ. ఈ ఫలితంతో సారా ఖురేషీ వచ్చే ఏప్రిల్‌లో కోల్‌కతాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికైంది.

గత ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ టోర్నీలో విజేతగా నిలిచి ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు అర్హత సాధించింది. గత ఏడాది బెంగళూరులో జరిగిన అంతర్ రాష్ట్ర పోటీల్లోనూ సారా ఖురేషీ బంగారు పతకాన్ని దక్కించుకుంది.
 

మరిన్ని వార్తలు