కోచ్‌ బ్రిజ్‌ కిషోర్‌కు శాట్స్‌ చేయూత

27 Feb, 2018 10:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాట్స్‌ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ బ్రిజ్‌ కిషోర్‌ను సోమవారం శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి పరామర్శించారు. గత పది రోజులుగా అనారోగ్యంతో బ్రిజ్‌ కిషోర్‌ పంజగుట్టలోని ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చికిత్స కోసం రూ. 2 లక్షల చెక్‌ను అందజేశారు. ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అరుణ రెడ్డికి ఆయనే కోచ్‌గా ఉన్నారు.

మరిన్ని వార్తలు