ఫైనల్లో సాత్విక్ జంట

12 Dec, 2016 15:01 IST|Sakshi

ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాత్విక్ సారుురాజ్ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 8-11, 11-6, 11-2, 11-3తో ఆరోన్ చియా-జిన్ హవా తాన్ (మలేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ విభాగంలో శ్రేయాన్షి పరదేశి (భారత్) 12-11, 11-6, 11-7తో ఐదో సీడ్ హు జెన్ గ్రేస్ చువా (సింగపూర్)పై సంచలన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. 

మరిన్ని వార్తలు