సెమీస్‌లో జోష్నా చినప్ప, సౌరవ్‌ ఘోషాల్‌ 

4 May, 2019 01:07 IST|Sakshi

ఆసియా స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ప్లేయర్లు జోష్నా చినప్ప, సౌరవ్‌ ఘోషాల్‌ మహిళల, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. కౌలాలంపూర్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో జోష్నా 12–10, 13–11, 11–7తో భారత్‌కే చెందిన తాన్వీ ఖన్నాను ఓడించగా... సౌరవ్‌ 11–4, 11–4, 11–3తో మొహమ్మద్‌ నఫీజ్వాన్‌ అద్నాన్‌ (మలేసియా)పై గెలుపొందాడు.    

మరిన్ని వార్తలు